తిరుమల సైకిల్ యాత్ర పూర్తి

తిరుమల సైకిల్ యాత్ర పూర్తి

రైలు మొక్కు తీర్చుకున్న ఎంఎల్ఎన్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ రైల్వే లైన్ ఏర్పాటయితే తిరుమల వస్తానని మొక్కిన హవేలి ఘనపూర్ కు చెందిన ఎంఎల్ఎన్ రెడ్డి సైకిల్ యాత్ర విజయవంతంగా తిరుమలకు చేరుకుంది. మంగళవారం తిరుమల కొండకు చేరిన ఎంఎల్ఎన్ రెడ్డి తలనీలాలు సమర్పించి స్వామిని దర్శించుకున్నారు. ఈనెల 1న హవేలి ఘనపూర్ మండలం కూచనపల్లి కూచాద్రి వెంకటేశ్వర స్వామి కొండ నుండి సైకిల్ యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. 666 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశారు. ఆయన వెంట దమ్ము యాదగిరి, శ్రీపాల్, చింతల శ్రీనివాస్ ఉన్నారు.