ఒకేషనల్ లో సత్తా చాటిన 'శ్రీసాయివాణి' విద్యార్థులు

జనగామ టౌన్ , ముద్ర : తెలంగాణ ఇంటర్ బోర్డు వారు ప్రకటించిన ఇంటర్  ఫలితాలలో జనగామ పట్టణంలోని శ్రీ సాయివాణి ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఎంఎల్ టీ గ్రూప్ లో మొదటి సంవత్సరంలో డీ.అన్వేష్ 500 మార్కులకు గాను 466 మార్కులు, ఎంపీహెచ్ డబ్ల్యూ (ఎఫ్) గ్రూప్ లో ఏ.మౌనిక 500 మార్కులకు 464 మార్కులు, అలాగే ద్వితీయ సంవత్సరంలో ఎంఎల్ టీ గ్రూపులో ఎండీ.ఫరీదా 1000 మార్కులకు గాను 941 మార్కులు, ఎంపీహెచ్ డబ్ల్యూ (ఎఫ్) గ్రూపులో కె.ఉషశ్రీ 1000 మార్కులకు గాను 938 మార్కులు సాధించారు. అలాగే కళాశాల MLT, MPHW (F) ప్రథమ ద్వితీయ విభాగాలలో 92 శాతం ఉత్తీర్ణత కూడా సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అలాగే ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను కళాశాల సెక్రెటరీ, ప్రిన్సిపాల్ కుటికంటి రమేష్, కళాశాల చైర్మన్ దూసరి నవీన్ కుమార్ వైస్ ప్రిన్సిపాల్ ఉల్లిరావు దేవేందర్, అధ్యాపకులు అభినందించారు.