బొడ్రాయి పున: ప్రతిష్టిద్దాం

బొడ్రాయి పున: ప్రతిష్టిద్దాం

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: బొడ్రాయి (గ్రామదేవతలు) పున:ప్రతిష్టను ఘనంగా నిర్వహించుకుందామని కమిటీ చైర్మన్ గంగుల సంపత్ రెడ్డి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామ దేవతల పున ప్రతిష్ట కార్యవర్గానికి జరిగింది. చైర్మన్ గా రంగుల సంపత్ రెడ్డి డైరెక్టర్లు కండ్ల కోలు శ్రీనివాస్, రావులపల్లి చంద్రమౌళి, వెలిశాల తిరుపతి, మాటూరి శ్రీనివాస్, ఉమ్మగోని రాజు, ఆకోజు  వెంకటేశ్వర్లు, వలబోజు జగన్నాథం, రచ్చ రవీందర్, మట్ట యాదగిరి, ఉరడి రాజు, కంకటి వరలక్ష్మి, కండ్ల కోలు వెంకటమ్మ, భూక్యలాలు, బబ్బుల సోమలింగం, వేముల నవీన్, షామందుల కార్తీక్, కంకటి రమేష్, ఆకోసం పున్నం చందర్, జంగిడి ప్రభాకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 30న ఉత్సవాలు ప్రారంభమై జూన్ 7,8,9 తేదీలతో గ్రామదేవతల పున ప్రతిష్ట ముగుస్తుందని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సమిష్టి కృషి చేయాలి అన్నారు.