జనగామలో 'కొమ్మూరి' గ్యారెంటీ

జనగామలో 'కొమ్మూరి' గ్యారెంటీ

ముద్ర ప్రతినిధి, జనగామ:జనగామ పట్టణ కేంద్రంలో రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల అమలు వివరిస్తూ జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్,ఆరు గ్యారెంటీలను ఇస్తుంది కాంగ్రెస్ అన్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత మొదలైన పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్ మాజీ చైర్మన్ వేమళ్ళ సత్యనారాయణ రెడ్డి, కంచ రాములు, చరాబుడ్ల దయాకర్ రెడ్డి, డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి జిల్లా నాయకులు ఉడత రవి యాదవ్, మేడ శ్రీనివాస్, జనగామ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగరబోయిన మల్లేష్, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.