చెవిలో పువ్వులతో జిపి కార్మికుల నిరసన

చెవిలో పువ్వులతో జిపి కార్మికుల నిరసన

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: పదిలక్షల ప్రమాద బీమా, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు మొదలైన డిమాండ్ల పరిష్కారం కోసం జిపి కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 16వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా జనగామ జిల్లా చిల్పూర్, స్టేషన్ ఘన్ పూర్ మండలాల గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగులు చెవిలో పువ్వులు పెట్టుకుని విన్నత్న నిరసన చేపట్టారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కండలోజు రాజు, రావుల జగన్నాథం, కుంభం రాజు, జీడి ఆనందం, రతన్ సింగ్, చిరంజీవి, గూడూరు భాస్కర్, బోసు రాజు తదితరులు ఉన్నారు.