బుల్లెట్ బండి దగ్ధం

బుల్లెట్ బండి దగ్ధం

ముద్ర ప్రతినిధి, జనగామ :జనగామ జిల్లా కేంద్రంలో ఇంటి బయట పార్కింగ్ చేసి ఉంచిన బుల్లెట్ బైక్ ను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో ఆరు సంవత్సరాలుగా ‌నివాసముంటున్న కందుల అరణ్ అనే భవన నిర్మాన కార్మికుడు 45 రోజుల కింద రాయల్ ఎన్ ఫీల్డ్  బైక్ ను ఫైనాన్స్ లో కొనుగోలు చేశాడు. ఎప్పటి లాగే ఇంటి బయట పార్క్ చేశాడు. తెల్లవారే సరికి బైక్ కాలిపోయి ఉండటంతో కన్నీరు మున్నీరు అయ్యాడు. పోలీసులు బైక్ కాల్చిన వ్యక్తులను గుర్తించి న్యాయం చేయాలని కోరుతున్నాడు.