టీ జే వి ఎస్ ఆధ్వర్యంలో ట్రిపుల్ ఐటీ ముట్టడి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంగళ వారం బాసర ట్రిపుల్ ఐటీ ని ముట్టడించారు. మెయిన్ గేటు ముందు ఆందోళన నిర్వహించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. అనంతరం తెలంగాణ విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ మాట్లాడారు. పదుల సంఖ్యలో విద్యార్థుల ప్రాణాలు పోతున్నా ముఖ్య మంత్రి కెసిఆర్, విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి లు కనీసం మనోధైర్యం ప్రసాదించే చర్యలు తీసుకోలేదన్నారు. జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సైతం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఈ ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జి చే విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.