40 ఏళ్లలో ఇంత అభివృద్ధి చూడలే

40 ఏళ్లలో ఇంత అభివృద్ధి చూడలే
  • రంగరాయ గూడెంలో అంగన్వాడి పాఠశాల ప్రారంభం 
  • రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: నా 40 ఏళ్ల రాజకీయంలో ఇంత అభివృద్ధి ఏ పార్టీ ఏ ప్రభుత్వం చేయలేదని కేవలం తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం రంగరాయ గూడెంలో ఎన్నారై వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులు నిర్వహించిన అంగన్వాడి పాఠశాలను స్థానిక శాసన సభ్యులు డాక్టర్ తాటికొండ రాజయ్యతో కలిసి ప్రారంభించి, విద్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాష్ట్రాన్ని పాలించిన పలు పార్టీలు అభివృద్ధిని విస్మరించాయన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ సారథ్యంలో నీళ్లు, కరెంటు, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అందిస్తున్న మహానుభావుడు కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.