కాంగ్రెస్ లో చేరిన మహేశ్వర్ రెడ్డి ముఖ్య అనుచరుడు
![కాంగ్రెస్ లో చేరిన మహేశ్వర్ రెడ్డి ముఖ్య అనుచరుడు](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_6492b0df932ca.jpg)
ముద్ర ప్రతినిధి, నిర్మల్: బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఆయనకు షాక్ ఇచ్చారు. నిర్మల్ పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడుగా కొనసాగిన నాందేడపు చిన్ను మహేశ్వర్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ ను వీడారు. అయితే కాంగ్రెస్ నాయకుడు కూచాడి శ్రీహరి రావుతో జరిగిన అంగీకారం మేరకు హైదరాబాద్ లొ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రేవంత్ రెడ్డి కండువా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ పథకాలపై ఆకర్షితులై రేవంత్ రెడ్డి సారధ్యంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలనినిర్ణయించుకున్నట్లు చిన్ను తెలిపారు. ఈ కార్యక్రమం లొ ఆయన వెంట సత్తు మలేష్, అర్జుమన్ అలీ, జునైద్ మెమన్ పట్టణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.