ప్రారంభమైన ఆశ కార్యకర్తల సమ్మె

ప్రారంభమైన ఆశ కార్యకర్తల సమ్మె

ముద్ర ప్రతినిధి, నిర్మల్:తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ  సమ్మె పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లాలో ఆశా వర్కర్ల సమ్మె సోమవారం ప్రారంభమైంది. తమకు ప్రతినెలా రూ.18వేల నియమిత వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పిస్తూ పి ఎఫ్, ఈ ఎస్సై కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆరోగ్య బీమాకోసం ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, పదవీ విరమణ ప్రయోజనాల క్రింద రూ. 5 లక్షలు చెల్లించాలని వారు కోరుతున్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు గంగామణి,  ఆశ యూనియన్  జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ,  గౌరవ అధ్యక్షురాలు సుజాత, జిల్లా ఉపాధ్యక్షురాలు  భాగ్య, కోశాధికారి రామలక్ష్మి,    సభ్యులు అనురాధ,రాధ,  ప్రమీల,ఇంద్రజ,వర్ణ,సుధా  లత,సౌమ్య,సుజాత,లక్ష్మి  తదితరులు  పాల్గొన్నారు.