పాట ఆవిష్కరించిన కాంగ్రెస్

పాట ఆవిష్కరించిన కాంగ్రెస్

ముద్ర ప్రతినిధి,నిర్మల్:నిర్మల్ కు చెందిన ఉద్యమ నేత, కాంగ్రెస్ నాయకులు కూచాడి శ్రీహరి రావుపై అభిమానులు రూపొందించిన పాటను శుక్రవారం నిర్మల్ లో  కాంగ్రెస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన నాయకుడు శ్రీహరి రావును అధికార పార్టీ అన్ని విధాల మోసం చేసిందని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని బలపర్చేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాడని, వచ్చే ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు గాజుల రవి, నాందెడపు చిన్ను, జునైద్ మెమెన్, శ్రీనివాస్ రెడ్డి, అర్జుమంద్ తదితరులు పాల్గొన్నారు.