వరంగల్ లో జరిగే  ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాలి - బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి

వరంగల్ లో జరిగే  ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాలి - బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి:సిద్దిపేట:ఈనెల 8న వరంగల్ లో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభ లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారని  ఆ సభను విజయవంతం చేయాలని బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.శుక్రవారం సిద్దిపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మోడీ 9 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో రాణించిందన్నారు.తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం అన్ని విధాల సహకరిస్తుందని  అన్నారు.వరంగల్ లో జరిగే సమావేశానికి ముందు రైల్వే వ్యాగన్, మ్యాన్ ఫ్యాక్చర్ యూనిట్,జాతీయ రహదారులను ఈ సందర్భంగా మోడీ ప్రారంభిస్తారని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, కేంద్రం సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.జిల్లాలోని అన్ని మండలాల నుంచి భారీగా బిజెపి శ్రేణులు వరంగల్ తరలిరావాలని ఆయన కోరారు.సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విద్యాసాగర్ పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడూరి నరేష్,నరసింహారెడ్డి మల్లమ్మ గారి శ్రీనివాస్ రెడ్డి,పిట్ల పరుశరాములు, కుమారస్వామి,గోనె మార్కండేయులు, కరుణాకర్ పాల్గొన్నారు.