కనకాపూర్ లో ట్రాన్స్ఫార్మర్ లు పగులగొట్టి రాగితీగ చోరీ

కనకాపూర్ లో ట్రాన్స్ఫార్మర్ లు పగులగొట్టి రాగితీగ చోరీ

రూ. 8 లక్షలకు పైగా నష్టం
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలం కనకాపూర్ లో  ట్రాన్స్ఫార్మర్ లను పగులగొట్టి అందులోని రాగి తీగ చోరీ చేశారు. గ్రామానికి సమీపాన ఉన్న వాగు ఒడ్డున ఉన్న పంట భూముల్లోని ఆరు ట్రాన్స్ఫార్మర్ లు పగులగొట్టి ఈ చోరీ కి పాల్పడ్డారు.  విద్యుత్ ఏ ఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై రాహుల్ గైక్వాడ్ కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో దాదాపు 8 లక్షల రూపాయల మేర సంస్థకు నష్టం వాటిల్లిందని ఏ ఈ మహేష్ తెలిపారు.