కడెం ప్రాజెక్టు కు పెరుగుతూ.. తగ్గుతున్న వరద.. 14 గేట్లు ఓపెన్ చేసిన అధికారులు

కడెం ప్రాజెక్టు కు పెరుగుతూ.. తగ్గుతున్న వరద.. 14 గేట్లు ఓపెన్ చేసిన అధికారులు

ఖానాపూర్, ముద్ర :  కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు శనివారం మధ్యాహ్నం వరకు 14 గేట్లు తెరిచారు. శుక్రవారం రాత్రి నుండి శనివారం పగటి వరకు ప్రాజెక్టు నీటి మట్టం పెరుగుతూ.. తగ్గుతూ... వస్తుంది. రాత్రి వరద తగ్గటంతో  11,14, 15, 17 గేట్లును ముసివేశారు. ఉదయం భారీగా వర్షం పడటంతో వరద పెరిగింది. దీనితో మూసిన గేట్లను మళ్ళీ ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టు లో ఇన్ ఫ్లో 76143 క్యూసెక్కుల ఉండగా, 76143 అవుట్ ఫ్లో ఉంది. 700 టీఎంసీ కేపాసిటి కాగా 687.725 టీఎంసీ ఉంది. గంట గంటకు వరద తగ్గుతూ,, పెరుగుతూ ఉంది. అధికారులు ప్రాజెక్టు తగిన జాగ్రత్త లు తీసుకుంతున్నారు.