డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అరెస్ట్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా గుండం పల్లికి వెళ్లిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీహరి రావును పోలీసులు గుండంపల్లి సమీపంలో అరెస్ట్ చేశారు. గుండం పల్లి సమీపంలో కాళేశ్వరం 27 వ ప్యాకేజీ పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం చేయటాన్ని ప్రశ్నించినందుకు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన నిర్మల్ లోని తన నివాసం నుండి బయలుదేరినప్పటి నుండి ఆయనను అనుసరిస్తూ వచ్చిన పోలీసులు గుండం పల్లి సమీపంలో అరెస్ట్ చేసి సారంగాపూర్ పోలీసు స్టేషన్ వైపు తరలించారు.