రిటైర్డ్ ఉద్యోగ సంఘానికి ఎంపి నిరంజన్ రెడ్డి రూ.2.50 లక్షల విరాళం

రిటైర్డ్ ఉద్యోగ సంఘానికి ఎంపి నిరంజన్ రెడ్డి రూ.2.50 లక్షల విరాళం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా రిటైర్డ్ ప్రభుత్వోద్యోగుల సంఘానికి రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి, ఆయన సోదరులు వెంకట రమణ రెడ్డి రూ.2.50 లక్షలు విరాళంగా అందజేశారు. సంఘం నిర్మించబోయే సమావేశ మందిరం నిర్మాణానికి ఈ నిధులు ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి విలాస్, ఎం సి లింగన్న, చందూలాల్, రమేష్ రావు, సత్తయ్య, ఎల్ గంగన్న, లక్ష్మణ్, రామాగౌడ్ పాల్గొన్నారు.