బంద్ విజయవంతం

బంద్ విజయవంతం
  • ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుర్రు అనిల్ కుమార్

మోత్కూర్ (ముద్ర న్యూస్ ) :వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మోత్కూర్ మండలంలో చేపట్టినా బంద్  విజయవంతం అయిందని ఎస్ ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుర్రు అనిల్ కుమార్ అన్నారు. మోత్కూర్ లో ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు ఇంజ ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా బ్రష్టు పటిస్తుందని అన్నారు.ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు ఇవ్వక పోవడం సిగ్గు చేటని అన్నారు.ఇందుకు రాష్ట్ర ప్రభుత్వనికి వ్యతిరేకంగా నిరసనలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు సుర్జీత్,చింటూ, నవీన్, తదితరులు పాల్గొన్నారు.