రెడ్ క్రాస్‌ సొసైటీ జనగామ జిల్లా కమిటీ ఎన్నిక

రెడ్ క్రాస్‌ సొసైటీ జనగామ జిల్లా కమిటీ ఎన్నిక
  • చైర్మన్‌గా డాక్టర్‌‌ లవకుమార్ రెడ్డి
  • కార్యదర్శిగా కన్న పరశురాములు

ముద్ర ప్రతినిధి, జనగామ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జిల్లా సహకార శాఖాధికారి కిరణ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. 349 మంది సభ్యులు గల జనగామ సొసైటీ ప్రెసిడెంట్‌గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. కాగా శుక్రవారం జరిగిన ఎన్నికలలో  చైర్మన్‌గాగా ప్రముఖ వైద్యుడు, ఐ ఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌‌ డి.లవకుమార్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకుడు ఫజ్జూరి గోపయ్య, కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్‌, సంఘ సేవకుడు కన్న పరశురాములు, కోశాధికారిగా ఉపాధ్యాయ సంఘ నాయకుడు కుర్రేముల యాదగిరి, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా రిటైర్‌‌ టీచర్‌‌ మహమ్మద్ గౌస్ మోహియుద్దీన్ ఎన్నికయ్యారు. ఇంకా జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులుగా బానాసి రజిని, అల్లాడి ప్రభాకర్ రావు, డా. పిట్ట సత్యం, సి.ఉపేందర్ రెడ్డి, గాదె క్యాథరిన్, పేర్వారం ప్రభాకర్, డా. ఎల్.లక్ష్మీనారాయణనాయక్, డా.చంద్రగిరి రాజమౌళి, కృష్ణ జీవన్ బజాజ్ ఎన్నికయ్యారు.