విద్యా దినోత్సవం సందర్భంగా ర్యాలీ

విద్యా దినోత్సవం సందర్భంగా ర్యాలీ

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట:-తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం నాడు విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా దినోత్సవాన్ని నిర్వహించి విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు అల్పాహారం కింద రాగిజావను అందజేశారు. సిద్దిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ జరిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.