లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఏడీసీపీ మహేందర్
![లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఏడీసీపీ మహేందర్](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_6431535f36320.jpg)
సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని అడిషనల్ డీసీపీ (అడ్మిన్ )ఎస్. మహేందర్ శనివారం రోజున దర్శించుకున్నారు. అర్చకులు ఎడిసిపికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు పలికి ,పూజలు చేసి సన్మానించి, దేవుని ప్రసాదం అందజేశారు. దేవుని జాతర సందర్భంగా ఆలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను ఏడిసిపి పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలా ఉంది ఇబ్బంది కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని బెజ్జంకి ఎస్ఐ ప్రవీణ్ రాజుకు సూచించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ కార్యవర్గ సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.