పెద్దమ్మ దేవాలయానికి విచ్చేసిన బండ ప్రకాష్, కొత్త ప్రభాకర్ రెడ్డి

పెద్దమ్మ దేవాలయానికి విచ్చేసిన బండ ప్రకాష్, కొత్త ప్రభాకర్ రెడ్డి

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లా దుబ్బాక లో జరుగుతున్న పెద్దమ్మ పెద్దిరాజుల బోనాల మహోత్సవంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు శనివారం మధ్యాహ్నం దుబ్బాక కు విచ్చేసిన నేతలిద్దరూ ముదిరాజ్ కులస్తుల పెద్దమ్మ పెద్దిరాజు దేవాలయ ఉత్సవాలలో పాల్గొన్నారు. సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రభుత్వం ముదిరాజులకు అండగా ఉంటుందని నేతలిద్దరూ చెప్పారు.

కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక ముదిరాజులకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించింది అని తెలిపారు అనంతరం బండ ప్రకాష్ ను కొత్త ప్రభాకర్ రెడ్డి లను ముదిరాజ్ కులస్తులు గజమాలతో సత్కరించారు ఈ  కార్యక్రమంలో దుబ్బాక ముదిరాజ్ సంఘం సభ్యులు బి ఆర్ఎస్ పార్టీ నేతలు రొట్టె రాజమౌళి , ఎల్లారెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.  అనంతరం అక్బర్ పేట- భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణ మహోత్సవం, చౌడలమ్మ కల్యాణ మహోత్సవంలో బండ ప్రకాష్ కొత్త ప్రభాకర్ రెడ్డిలు పాల్గొన్నారు అక్కడ కూడా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎంపీ పరామర్శ

ఇటీవల దుబ్బాక కు చెందిన చేనేత కార్మికుడు మంతూరి శ్రీనివాస్ బ్రెయిన్ స్ట్రోక్ తో  మరణించిన విషయం తెలుసుకున్న మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి  మృతుని కుటుంబీకులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.