మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి హరీష్ రావు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి హరీష్ రావు

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం మైలారం, ఖమ్మర్లపల్లి, అల్లీపూర్, చెల్కలపల్లి గ్రామాలలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శని వారం రోజున పరామర్శించారు. ఇటీవల సిద్దిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మైలారం గ్రామ బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బూరుగు వెంకటేష్ గౌడ్ కమ్మర్లపల్లిలో మరణించిన బిఆర్ఎస్ నాయకులు జక్కుల నాగరాజు యాదవ్ కుటుంబాలను మంత్రి హరీష్ రావు పరామర్శించి వారి తల్లిదండ్రులను ఓదార్చారు రెండు కుటుంబాలకు ప్రభుత్వము పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.