దుబ్బాకలో జరిగిన దశాబ్ది వేడుకల్లో పాల్గొన్న ఎంపీ

దుబ్బాకలో జరిగిన దశాబ్ది వేడుకల్లో పాల్గొన్న ఎంపీ

దుబ్బాక, ముద్ర: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో జరిగిన తెలంగాణ  దశాబ్ది ఉత్సవాలలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.

ఎస్ టి కార్పొరేషన్ ద్వారా లబ్దిపొందిన 15 మందికి, ఎస్ సి కార్పొరేషన్ ద్వారా లబ్దిపొందిన 50 మందికి,బిసి కార్పొరేషన్ ద్వారా లబ్దిపొందిన ముగ్గురికి ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక పుర అధ్యక్షురాలు గన్నె వనిత-భూమి రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత -కిషన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.