ఈనెల 8న సిద్దిపేటలో రెడ్డిల ఆత్మీయ సమ్మేళనం సదస్సు
సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు, ఈడబ్ల్యూస్ రిజర్వేషన్స్ పూర్తిస్థాయిలో అమలు తదితర డిమాండ్ల సాధనకై రెడ్డి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఈనెల 8న, ఉదయం 11 గంటలకు బైరి అంజయ్య గార్డెన్ లో రెడ్ల ఆత్మీయ సమ్మేళనం సదస్సు జరగనుంది సిద్దిపేట జిల్లాలోని వివిధ మండలాల్లో రెడ్డి జేఏసీ ల ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన పర్యటనలు చేస్తూ పోస్టర్లను ఆవిష్కరిస్తూ కరపత్రాలను పంచుతున్నారు పార్టీలకతీతంగా రెడ్డి కుల నాయకులను ప్రజాసంఘాల నాయకులను రెడ్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానిస్తున్నారు సిద్దిపేట చిన్నకోడూరు కోహెడ దుబ్బాక నంగునూరు తొగుట కొండపాక తొగుట మిరుదొడ్డి మండలాల్లో రెడ్డి జేఏసీ ప్రచారం విస్తృతంగా జరుగుతుంది