ప్రజల ఆరోగ్యం పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
![ప్రజల ఆరోగ్యం పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_64720e19e81cb.jpg)
భోదకాలు మందుల పంపిణి దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనితా భూమిరెడ్డి
సిద్దిపేట : ముద్ర ప్రతినిధి ప్రజల ఆరోగ్యం పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సిద్ధిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూమి రెడ్డి తెలిపారు. శనివారం నాడు దుబ్బాక మున్సిపల్ పట్టణంలో 14 వ ,16 వార్డ్ కౌన్సిలర్ లు అస.యాదగిరి ,దేవుని లలితతో కలిసి బోదకాలు వ్యాధిగ్రస్తులకు నివారణ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోధకాలు వ్యాధి నివారణనే లక్ష్యంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ కిట్ల ను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. భోదకాలు వ్యాదిగ్రస్తులు క్రమం తప్పకుండా ప్రభుత్వం నుండి పంపిణి చేస్తున్న మందులను వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎం ఎస్ బాల్ నరసవ్వ, ప్రేమ లత,ఆశా వర్కర్లు ,తదితరులు పాల్గొన్నారు.