మల్లన్న సాగర్ నిర్మాణంతో దుబ్బాక సస్యశ్యామలం

మల్లన్న సాగర్ నిర్మాణంతో దుబ్బాక సస్యశ్యామలం

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

ముద్ర, దుబ్బాక సిద్దిపేట జిల్లా దుబ్బాక లోని బాలాజీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ సాగునీటి దినోత్సవం వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ సాగునీటి శాఖ ఆధ్వర్యంలో నీటి దినోత్సవ వేడుకల్లో మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సభలో ఎంపీ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ఇర్రిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి కె దక్కుతుందని అన్నారు.

దుబ్బాక నియోజకవర్గ లో మల్లన్నసాగర్ నిర్మిచడం దుబ్బాక నియోజకవర్గ ప్రజల అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ వివిధ మండలలా ప్రజా పరిషత్తు అధ్యక్షులు జడ్పీటీసీలు ఆత్మ కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము చైర్మన్లు దుబ్బాక మున్సిపల్ చైర్మన్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్స్ పార్టీ నాయకులు, నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.