సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం: జనగామ జడ్పీ చైర్మన్ పాగాల
![సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం: జనగామ జడ్పీ చైర్మన్ పాగాల](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_63ff6363b09c6.jpg)
ముద్ర ప్రతినిధి, జనగామ: అదానీ నష్టాలను పూడ్చడం కోసం కేంద్రం ప్రజల నుంచి దోచుకోవడం మొదలు పెట్టిందని, ఈ క్రమంలో గ్యాస్ ధరలను పెంచిందని జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి ఆరోపించారు. బుధవారం జనగామలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.