మక్కల కొనుగోలుకు సిద్ధంగా ఉండాలి - అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్

మక్కల కొనుగోలుకు సిద్ధంగా ఉండాలి - అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్

ముద్ర ప్రతినిధి, జనగామ: మక్కల కొనుగోలుకు సర్వం సిద్ధం చేయాలని జనగామ అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఆదేశించారు. గురువారం ఆయన  జిల్లాస్థాయి మొక్కజొన్నల కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 9వేల ఎకరాలలో మొక్కజొన్న పంటలు సాగు చేశారని అందులో 15 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు. వాటి కొనుగోలుకు జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి, జఫర్ గఢ్ మండలాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు గుర్తించామన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే కొనుగోలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో మార్క్ ఫెడ్ డీఎం డి. మహేష్, డీసీఓ కిరణ్ కుమార్, డీసీఎస్ఓ ఎం.రోజా రాణి, డీఎంఓ నాగేశ్వర శర్మ, డీఎం సివిల్ సప్లై సంధ్యారాణి, డీపీఎం రాజేంద్రప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారి శిరీష పాల్గొన్నారు.