సీఎం చిత్రపటానికి జేపీఎస్ ల క్షీరాభిషేకం

సీఎం చిత్రపటానికి జేపీఎస్ ల క్షీరాభిషేకం

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి అభిషేకం చేశారు. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్, చిల్పూర్, జఫర్గడ్, రఘునాథపల్లి మండలాల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విజయ్, గౌరవ అధ్యక్షుడు రంగారెడ్డి, జఫర్గడ్ అధ్యక్షుడు రాజు, చిలుకూరు అధ్యక్షుడు తిరుమల, స్టేషన్ ఘన్ పూర్ అధ్యక్షుడు సంతోష్, రఘునాథపల్లి అధ్యక్షుడు మహేష్, కోఆర్డినేటర్ జిల్లెల శేఖర్ కార్యదర్శులు పాల్గొన్నారు.