‘నాగపురి’ సొంత గూటికి..

‘నాగపురి’ సొంత గూటికి..

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ రాజలింగం

ముద్ర ప్రతినిధి, జనగామ : చేర్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో నాగపురి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అనంతరం రాజలింగం మాట్లాడుతూ జనగామలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని తెలిపారు. పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేస్తానన్నారు. ఇక బీఆర్ఎస్‌లో కనీస విలువలు లేవని, ప్రజలు, నాయకులకు ఎలాంటి సహకారం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యమకారులను అణచి వేయడంలో కేసీఆర్ ముందు వరుసలో నిలుస్తారన్నారు. మాయమాటలు, అబద్ధాలు, మోసపూరిత హామీలతో కాలయాపన చేయడం తప్ప కేసీఆర్‌‌ ప్రజలకు చేసిందేమీలేదని విమర్శించారు. అమరుల ఆశయం నెర్చడంలో బీఆర్‌‌ఎస్‌ విఫలమైందన్నారు. ఆ మనోవేదనతోనే తన సొంత పార్టీ అయినా కాంగ్రెస్‌లో చేరుతున్నానని నాగపురి తెలిపారు. కొమ్మురి ప్రతాప్‌రెడ్డి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మద్దూర్ జడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి, ముఖ్య నాయకులు అంబాలా శ్రీనివాస్, గంగం గాలిరెడ్డి పాల్గొన్నారు.