మెదక్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారం

మెదక్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారం

 ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలో బిఆర్ఎస్ అభ్యర్థి ఎం.పద్మా దేవేందర్ రెడ్డి మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రతి ఇంటి వద్ద పద్మా దేవేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులతో ఎదురేగారు. యువకులు శాలువా, పూల దండాలతో సత్కరించారు. జై పద్మక్క అంటూ నినాదాలు చేశారు. మరోసారి ఆడబిడ్డగా ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను కోరారు. కెసిఆర్ హయాంలోనే మెదక్ అభివృద్ధి చెందిందన్నారు. కెసిఆర్ మూడో సారీ సీఎం కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున్ గౌడ్, ఎఎంసి చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్లు రాగి వనజ, మామిళ్ళ ఆంజనేయులు, గంగాధర్, కృష్ణాగౌడ్, మాజీ కౌన్సిలర్లు శ్రీధర్ యాదవ్, చంద్రకళ, అశోక్, లింగారెడ్డి, అమితా క్రిస్టల్, మధు, ఆరీఫ్ మహిళలు, యువకులు పాల్గొన్నారు.