ఎన్ డి ఎస్ ఎల్ వెంటనే తెరిపించాలి

ఎన్ డి ఎస్ ఎల్ వెంటనే తెరిపించాలి

మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి డిమాండ్
ముద్ర ప్రతినిధి, మెదక్: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెరిపిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ తెరవలేదని, ఇప్పటికైనా వెంటనే నిజాం దక్కన్ షుగర్ కర్మాగారం తెరిపించాలని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక్కడ మూతపడిన కర్మాగారాలు తెరిపించకుండా, విశాఖ ఉక్కు కొనుగోలుచేస్తామని అనడం శోచనీయమన్నారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే స్పందించకపొతే రైతుల ఆగ్రహానికి గురికాకా తప్పదన్నారు.