ఎమ్మెల్సీ గెలుపుపై 'పేట'లో బిజెపి నాయకుల సంబరాలు

ఎమ్మెల్సీ గెలుపుపై 'పేట'లో బిజెపి నాయకుల సంబరాలు

పెద్ద శంకరంపేట, ముద్ర:  ఉమ్మడి హైదరాబాద్: మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, భారతీయ జనతా పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గెలుపొందడంతో శుక్రవారం పెద్ద శంకరంపేటలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పేట బిజెపి కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మండల బిజెపి అధ్యక్షులు కోణం విఠల్ మాట్లాడుతూ తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ పాలనను కొనసాగిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు మంగలి కృష్ణ,బండల శ్రావణ్,  బూగుడాల కృష్ణ, విశ్వనాథం, సాయిలు, సురేష్, విజయ్ కుమార్, సంగమేశ్వర్,  నర్సింగ్, కృష్ణ, దమ్ము సాయిలు, కుమార్,  సుభాష్, తదితరులు పాల్గొన్నారు.