ఐకేపీ కొనుగోలు కేంద్రంలో చోరీ

ఐకేపీ కొనుగోలు కేంద్రంలో చోరీ

తూప్రాన్ :ముద్ర: రైతులు చేసిన కష్టం చేతికి వస్తదో రాదో అని బిక్కు బిక్కు మంటూ కాపాడుకుంటున్న పంట తీరా చేతి కొచ్ఛేసరికి దొంగల పలు అయిపోయే అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తూప్రాన్ మండలం  యావపూర్ గ్రామంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రంలో గ్రామానికి చెందిన చాకలి స్వామి, పాక మల్లేష్ లకు చెందిన వడ్లను మంగళవారం రాత్రి ఎవరో గుర్తు తెలియని దొంగలు దొంగిలించారు. రైతులు ఉదయం వచ్చి చూసేసరికి వడ్లు చోరికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 20 బస్తాల వడ్లు దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధిత రైతులు తెలిపారు. న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.