మెదక్ లో గాంధీ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే పద్మ

మెదక్ లో గాంధీ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే పద్మ
  • గాంధీ ఆశయాలకనుగుణంగా కెసిఆర్ పాలన

ముద్ర ప్రతినిధి, మెదక్:గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాధిస్తూ కెసిఆర్ పాలన చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు.గాంధీ జయంతి సందర్భంగా మెదక్ రాందాస్ చౌరస్తాలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్బంగా జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుండి ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళలతో కలిసి  ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ద్విచక్ర వాహన ర్యాలీగా వచ్చి అదనపు కలెక్టర్ రమేష్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్ర ప్రభుత్వంలో మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ సాధించారన్నారు.మహాత్మా గాంధీకి విగ్రహాన్ని ఆవిష్కరిండం నా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. గాంధీ ఆశయాలకు అనుసరిస్తూ అహింసా పద్ధతిలో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మునిసిపల్ వైస్ చైర్మెన్ మల్లికార్జున్ గౌడ్, మెదక్ మార్కెట్ కమిటీ చైర్మెన్ బట్టి జగపతి, కౌన్సిలర్లు రాగి వనజ, జయరాజ్, ఏడుపాయల డైరెక్టర్ రాగి చక్రపాణి, నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, రాము, మెడిశెట్టి శంకర్, కొండా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.