15న మెదక్ జిల్లా విద్యుత్ వినియోగదారుల సదస్సు: ఎస్ఈ జానకి రాములు
![15న మెదక్ జిల్లా విద్యుత్ వినియోగదారుల సదస్సు: ఎస్ఈ జానకి రాములు](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6410625abb484.jpg)
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా విద్యుత్ వినియోగదారులతో ఈనెల 15న ఉ.11 గంటల నుండి మెదక్ విద్యుత్ సర్కిల్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఎస్ఈ జానకి రాములు తెలిపారు. విద్యుత్ వినియోగదారులతో నేరుగా కలిసి సమస్యలు తెలుసుకోవడానికి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యుత్ కు సంబంధిచినటువంటి సమస్యలు, లో వోల్టేజ్, విద్యుత్ బిల్లులు, ట్రాన్స్ఫార్మర్ ఓవర్ లోడ్ సమస్యలు, విద్యుత్ సంబంధిచిన సమస్యలను వినియోగదారుల ఫిర్యాదు పరిష్కార సదస్సును ఉపయోగించుకోవాలని సూచించారు.