వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కరపత్రం ఆవిష్కరణ

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కరపత్రం ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కరపత్రాలను మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ వైస్ చైర్మన్ అరెళ్ల మల్లికార్జున్ గౌడ్, ఆలయ చైర్మన్ కంచి మధుసూదన్ తో కలిసి శనివారం ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. అంతకుముందు ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మే 9 నుండి 14 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 13న స్వామి వారి కల్యాణోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్, నాయకులు దుర్గాప్రసాద్, సుమన్, నిఖిల్, పురుషోత్తం, భక్తులు పాల్గొన్నారు.