ప్రభుత్వాసుపత్రి ఘటనపై కలెక్టర్ ఆరా 

ప్రభుత్వాసుపత్రి ఘటనపై కలెక్టర్ ఆరా 

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ఓ రోగిని కాళ్లు పట్టుకొని లాక్కెల్లిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పందించారు.  ఈ ఘటన పై ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్తో మాట్లాడానని, పూర్తి విచారణ జరుపుతామని అన్నారు. స్ట్రెచర్లు, వీల్చైర్ల అవసరాలపై అధ్యయనం చేసి, అవసరం మేర అన్నీ ఏర్పాట్లు చేస్తామన్నారు.