కలెక్టరేట్ లో ధాన్యం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కలెక్టరేట్ లో ధాన్యం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:  కలెక్టర్ కార్యాలయంలో యాసంగి ధాన్యం కంట్రోల్ రూం ను మంగళవారం  జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సమస్యలు ఉన్న ఫోన్ నెంబర్ 08468-220051 కు తెలియజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్ఓ పద్మ, సివిల్ సప్లై డిఎం అభిషేక్ సింగ్, ఏఎస్వో వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు