తొనిగండ్లలో బీజేపీ సద్దుల సమావేశం - హాజరైన జిల్లా అధ్యక్షులు గడ్డం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజశేఖర్

తొనిగండ్లలో బీజేపీ సద్దుల సమావేశం - హాజరైన జిల్లా అధ్యక్షులు గడ్డం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజశేఖర్

ముద్ర ప్రతినిధి, మెదక్:బిజెపి తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మెదక్  నియోజకవర్గంలోని రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామం హనుమాన్ గుడి దగ్గర ఏర్పాటు చేసిన సద్దుల సమావేశం (టిఫిన్ బైటక్) ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హై కోర్టు సీనియర్ న్యాయవాది  తాళ్ళపల్లి రాజశేఖర్ పాల్గొని దిశా నిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి ఏవిధంగా తీసుకెళ్ళాలి అనే అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్ధన్ రెడ్డి, జిల్లా అధికారి ప్రతినిధి నందా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్,  జిల్లా ప్రధాన కార్యదర్శి భానప్పగారి సుధాకర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ఎక్కలదేవ్ మధు, జిల్లా కార్యవర్గ సభ్యులు కల్కి నాగరాజు, ఓబిసి మొర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బక్కవారి శివ, నియోజకవర్గంలోని  నాయకులు, మండలాల అధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, శక్తి కేంద్రం ఇన్చార్జులు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.