ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా చేగుంట వడియారం సమీపంలోని మక్కరాజుపేట రోడ్ బ్రిడ్జి వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీరిని లారీ
రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టింది. మృతులు రామయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ కి చెందిన రవితేజ (23), బాలాజీ సింగ్ (32)లుగా గుర్తించారు. చేగుంట పోలీసులు విచారణ జరుపుతున్నారు.