కన్నపిల్లలపై వేడి నీళ్లు పోసిన తల్లి

కన్నపిల్లలపై వేడి నీళ్లు పోసిన తల్లి
  • కొడుకు పరిస్థితి విషమం

ముద్ర ప్రతినిధి, మెదక్:పిల్లలను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన కన్నతల్లే దయ్యమైంది. కర్కశంగా వ్యవహరించి ఉదయం పిల్లలు నిద్ర లేవడం లేదని ఆగ్రహంతో  ఇద్దరు పిల్లలపై వేడి నీళ్లుపోసిందో కన్నతల్లి. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరిన సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్థి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎలుక పల్లిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలీలా ఉన్నాయి.  గ్రామానికి  చెందిన ఎంచర్ల సాయిలు, సంతోష భార్యాభర్తలు గతకొద్ది రోజులుగా కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవని పలుమార్లు కుల పెద్దల సమక్షంలో భార్యాభర్తలకు నచ్చ చెప్పారు.అయిన వారి పద్ధతి మారలేదు. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఉదయం కూతురు కుమారుడు శ్రీనిధి, రిత్విక్ ఉదయం పిల్లలు నిద్ర లేవడం లేదని ఆగ్రహంతో తల్లి సంతోష వేడినీళ్లు పోయడంతో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. అందులో కుమారుడు రుత్విక్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.ఇద్దరి పిల్లలను మెదక్ ఎంసిహెచ్ హాస్పిటల్లో ఇద్దరు చిన్నారులను తరలించి చికిత్స చేస్తున్నారు.