కారు - స్కూటీ ఢీ ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

కారు - స్కూటీ ఢీ ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఎదురెదురుగా వస్తున్న కారు- స్కూటీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గేట్ శివారులోని రామానాయుడు   విజ్ఞానజ్యోతి కృషి కేంద్రం సమీపంలో మెదక్- హైదరాబాద్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన దోహి, సరోజ్, కన్నయ్య నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి  గేటు వద్ద సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమలో కూలీలుగా పనిచేస్తున్నారు. ముగ్గురు కలిసి స్కూటీపై నిత్యావసర సరుకులు, కూరగాయల కోసం కౌడిపల్లి మండలంలోని వెంకట్రావుపేట్ గేటు వద్దకు వచ్చి కొనుగోలు చేసి తిరిగి వెళుతున్న క్రమంలో తునికి గేట్ సమీపంలో నర్సాపూర్ నుంచి మెదక్ వైపు వస్తున్న AP29BE3689 నంబర్ గల కారు -స్కూటీ బలంగా ఢీకొన్నాయి. స్కూటీ పూర్తిగా నుజ్జునుజ్జయింది.  దీంతో స్కూటీపై ఉన్న దోహి (21), సరోజ్ (22) అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి కన్నయ్యకు తీవ్రమైన రక్త గాయాలయ్యాయి. కారు డ్రైవర్ ధన్ సింగ్ స్వల్ప గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న మెదక్ కు చెందిన  ఫరియాబేగం, ఆసిఫాలకు భుజం, వెన్నెముకలకు బలమైన దెబ్బలు తగలడంతో ప్రైవేట్ అంబులెన్స్ లో చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  కౌడిపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. యువకుల మృతదేహాలను, తలకు రక్త గాయాలైన కన్నయ్యను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.