సెకండ్ ఎఎన్ఎంల అరెస్ట్

సెకండ్ ఎఎన్ఎంల అరెస్ట్

ముద్ర ప్రతినిధి, మెదక్: చలో అసెంబ్లీకి వెళ్లడానికి సిద్ధమైన సెకండ్ ఏఎన్ఎంలను మెదక్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ తరలించారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగులుగా గుర్తించాలనే రెండు డిమాండ్లతో ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా  ఐదువేల మంది బయలు దేరేందుకు సిద్దయ్యారు. హైదరాబాద్ అసెంబ్లీకి వెళ్లకుండా మెదక్ లో  అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారు. సుధారాణి, రాజ్యలక్ష్మి, దీవెన తదితరులు ఉన్నారు.