రోడ్డు దాటుతుండగా ప్రమాదం...వ్యక్తి మృతి

రోడ్డు దాటుతుండగా ప్రమాదం...వ్యక్తి మృతి

తూప్రాన్, ముద్ర: జాతీయ రహదారిపై వ్యక్తి రోడ్డు దాటుచుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందిన ఘటన మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సందీప్ రెడ్డి కథనం ప్రకారం కాళ్ళకల్ గ్రామ పరిధిలో సోమవారం అర్దరాత్రి 12 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి (25) రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం దీకొనడంతో  తీవ్రంగా గాయపడగా అతన్ని గాంధీ హాస్పటల్ కు తరలించారు. తెల్లవారు జామున చికిత్స పొందుతూ మృతిచెందాడు.  మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఎవరైనా ఆచూకీ తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలపాలని ఎస్ఐ సందీప్ రెడ్డి సూచించారు.