నర్సాపూర్ లో సీఎం సభాస్థలి పరిశీలించిన మంత్రి హరీష్

నర్సాపూర్ లో సీఎం సభాస్థలి పరిశీలించిన మంత్రి హరీష్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఈనెల 16న మెదక్ జిల్లా నర్సాపూర్ లో  ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ  నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డితో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, పెద్ద సంఖ్యలో తరలి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, అందరూ కలిసి విజయవంతం చేయాలని మంత్రి సూచించారు.