సీఎం మెదక్ పర్యటన వాయిదా

సీఎం మెదక్ పర్యటన వాయిదా

ముద్ర ప్రతినిధి, మెదక్: ముఖ్యమంత్రి కెసిఆర్ మెదక్ పర్యటన వాయిదా పడింది. ఈనెల 19న రావాల్సి ఉండగా 
భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ నేపథ్యంలో వాయిదా వేశారు. ఈ నెల 19 న జరుపతలపెట్టిన సిఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన 23వ తేదీకి వాయిదా వేశారు. సీఎం చేతుల మీదుగా కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బిఆర్ఎస్ భవన్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రాకకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు.