సిఎం కెసిఆర్ కు భారీ మెజారిటీ అందించాలి - ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి

సిఎం కెసిఆర్ కు భారీ మెజారిటీ అందించాలి - ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి

ముద్ర తూప్రాన్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ను మూడవ సారి భారీ మెజారిటీ తో గెలిపించాలని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సూచించారు. శనివారం మనోహరాబాద్ మండల కేంద్రం లోని ప్రవేటు ఫంక్షన్ హల్ లో మండల పార్టీ అధ్యక్షులు పురం మహేష్ అధ్యక్షతన నిర్వహించిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అయన ముఖ్య అతిధిగా హాజరై దిశా నిర్దేశం చేశారు. మనోహరాబాద్ మండలం నుండి నియోజకవర్గం లోనే అత్యధిక మెజారిటీ అందించాలని కోరారు. కార్యకర్తలు కష్టపడి భారీ మెజారిటీ అందించి మొదటి స్థానం లో నిలిపిన బూత్ కమిటీ కి నగదు బహుమతి అందిస్తానని హామీ ఇచ్చారు. బూత్ కమిటీ లను ఏర్పాటు చేసుకుని భారీ మెజారిటీ లక్ష్యంగా పని చేయనున్నట్లు అయన తెలిపారు. అదే విదంగా త్వరలో ముఖ్యమంత్రి సభ ఉన్నందున దానిని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో లో సర్పంచ్ ల ఫోరమ్ కన్వీనర్ మహిపాల్ రెడ్డి,పాక్స్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి,వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి,నాయకులు శేఖర్ గౌడ్,కృష్ణ గౌడ్,రవి, చంద్రశేఖర్, పెంటగౌడ్,పెంటయ్య సర్పంచ్ లు అర్జున్, నాగభూషణం, నర్సయ్య,వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ లు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.