డెంగీ వ్యాధి నివారించాలి- పేట వైద్యాధికారి డాక్టర్ వికాస్

డెంగీ వ్యాధి నివారించాలి- పేట వైద్యాధికారి డాక్టర్ వికాస్

పెద్దశంకరంపేట, ముద్ర:  డెంగీ వ్యాధి నివారణకు సమిష్టి కృషి చేయాలని స్ధానిక వైద్యాధికారి డాక్టర్ వికాస్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం నాడు డెంగీ వ్యాధి నివారణకు ప్రజలకు అవగాహన కలిగేందుకు ర్యాలీ నిర్వహించారు.  పెద్ద శంకరంపేట వైద్యాధికారి డాక్టర్ వికాస్ మాట్లాడుతు పెద్దశంకరంపేటలో  డెంగీ వ్యాధి దినోత్సవం సందర్భంగా గాంధీ చౌక్ నుండి ప్రభుత్వ హాస్పిటల్ వరకు ర్యాలీ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పేట వైద్య సిబ్బంది యాదయ్య,  వెంకటేశం, శ్రీదేవి, కమల, స్వరూప, గంగమని, తదితరులు పాల్గొన్నారు.