పెన్షనర్ల సమస్యలు తీర్చాలని ఆందోళన

పెన్షనర్ల సమస్యలు తీర్చాలని ఆందోళన

ముద్ర ప్రతినిధి, మెదక్: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మెదక్ జిల్లా కలెక్టరేట్ ఆందోళన చేశారు. పెన్షనర్ల సమస్యలు, 398 స్పెషల్ టీచర్లు, పండితులు, పీఈటీల సర్వీస్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తూ పెన్షనరీ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో వెంటనే విడుదల చేసి లబ్ధి చేకూర్చాలని, స్పెషల్ టీచర్ల పక్షాన పెన్షన్ దారుల జేఏసీ  డిమాండ్ చేస్తూ కు వినతిపత్రం అందజేశారు. కార్యాలయంలో కోడూరు నర్సింహ రెడ్డి, కె. నరేష్, టీ. వెంకన్న, డి. జీవరత్నం , బి. నరేందర్ రెడ్డి, కె. భాగయ్య, బి. రమేష్ ఉన్నారు.